81 ఎకరాలను అప్పగించిన రైతులు

15 Sep, 2016 18:52 IST|Sakshi

తొగుట: కొమురవెల్లి మల్లన్న సాగర్‌ నిర్మాణానికి గురువారం 81 ఎకరాలను రైతులు అప్పగించినట్టు తహసీల్దార్‌ గుగులోత్‌ దేశ్యా నాయక్‌ తెలిపారు. తొగుటలో 27 మంది రైతులు 50 ఎకరాలు, ఏటిగడ్డ కిష్టాపూర్‌లో ముగ్గురు రైతులు ఒక ఎకరం, పల్లెపహాడ్‌లో 25 మంది రైతులు 30 ఎకరాలను అప్పగించారన్నారు.

>
మరిన్ని వార్తలు