మిర్చియార్డ్లో రగడ.. రైతుల ఆందోళన

17 Mar, 2016 09:49 IST|Sakshi

గుంటూరు: గుంటూరులోని ఓ మిర్చియార్డ్లో గురువారం రగడ చోటుచేసుకుంది. మిర్చియార్డ్లో లావీదేవీలను అధికారులు నిలిపివేశారు. ఈ నేపథ్యంలో మిర్చియార్డ్ ఎదుట రైతులు ఆందోళనకు దిగారు. మిర్చి కొనుగోళ్లలో ఈ-ట్రేడింగ్ విధానాన్ని రద్దు చేయాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. అయితే భారీగా సరుకు ఉండటంతో అధికారులు లావీదేవీలు నిలిపివేసినట్టు ప్రకటించారు.

గతకొన్ని రోజులుగా యార్డ్లో ఎక్కువమొత్తంలో సరుకు ఉండిపోయింది. దాంతో మిర్చి డిక్కీలు భయటకు తరలించే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. మరోవైపు రైతులు తమ వద్ద మిర్చి కొనలంటూ ఆందోళనకు దిగారు.
 

>
మరిన్ని వార్తలు