సోలార్‌ పనులను అడ్డుకున్న రైతులు

9 Jan, 2017 23:03 IST|Sakshi
సోలార్‌ పనులను అడ్డుకున్న రైతులు

 కల్లూరు : తమ భూములకు పరిహారం చెల్లించకుండానే సోలార్‌ పనులు చేస్తుండడంతో ఓర్వకల్లు మండలం తిప్పాయిపల్లెకు చెందిన రైతు గొల్ల కిష్టన్న కుమారులు అడ్డుకున్నారు. కంపెనీ ప్రతినిధులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడి చేరుకోగానే రైతులు నడిపి తిక్కయ్య, పెద్ద తిక్కయ్య, చిన్న స్వామన్న వారితో వాగ్వాదానికి దిగారు. చివరకు రైతులను అరెస్టు చేసి స్టేషన్‌కు తీసుకువెళ్లారు. తర్వాత స్వంత పూచీకత్తుపై విడుదల చేశారు. రైతుల అరెస్టును సీపీఎం పాణ్యం డివిజన్‌ కార్యదర్శి జి రామక్రిష్ణ ఖండించారు. రైతుల భూములను నిర్దాక్షిణ్యంగా లాక్కుని పరిహారం చెల్లించకపోవడం ప్రభుత్వానికి తగదన్నారు. రైతులకు వెంటనే పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

>
మరిన్ని వార్తలు