కుమారుడిపై తండ్రి కత్తితో దాడి

17 Jul, 2016 23:38 IST|Sakshi
పోడూరు(పాలకొల్లు సెంట్రల్‌) : పనికి వెళుతున్న కుమారుడు ఇంట్లో సొమ్ములు ఇవ్వడం లేదన్న కోపంతో తండ్రి కత్తితో దాడిచేసిన సంఘటన ఆదివారం రాత్రి పోడూరు మండలం పెనుమదం పల్లగుంట ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. మొల్లేటి బాలాజీ(25) తాపీ పనికి వెళుతుంటాడు. అతని తండ్రి వెంకటేశ్వరరావు కొబ్బరి దింపు కార్మికుడు. తాపీపనికి వెళుతున్నా ఇంట్లో సొమ్ములు ఇవ్వడం లేదని తండ్రి వెంకటేశ్వరరావు రాత్రి బాలాజీతో గొడవపడ్డాడు. ఆ సమయంలో ఇద్దరూ మద్యం తాగి ఉన్నారు. గొడవ తీవ్రమవడంతో వెంకటేశ్వరరావు ఇంట్లోని కత్తి తీసుకుని బాలాజీపై దాడి చేశాడు. దీంతో బాలాజీ మెడ, చేతిపై కత్తివేట్లు పడి తీవ్రంగా గాయపడ్డాడు. బాలాజీ బంధువు అతడిని  పాలకొల్లు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స చేసిన వైద్యులు పరిస్థితి విషమించడంతో కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించాని సూచించారు. బాధితుడు బాలాజీ ఫిర్యాదు మేరకు ఎసై ్స డి.ఆదినారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

 

మరిన్ని వార్తలు