భాస్కరాచారికి వైఎస్సార్‌సీపీ సన్మానం

28 Aug, 2016 00:46 IST|Sakshi
మహబూబ్‌నగర్‌ అర్బన్‌: తెలంగాణ ఫొటో జర్నలిస్టు అసోసియేషన్, భాషా సాంస్కతిక శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన న్యూస్‌పిక్షర్‌ పోటీల్లో రాష్ట్రస్థాయిలో ప్రథమ బహుమతి పొందిన ‘సాక్షి’ ఫొటోగ్రాఫర్‌ భాస్కరాచారిని శనివారం వైఎస్సార్‌సీపీ నాయకులు సన్మానించారు. రాష్ట్రస్థాయిలో జిల్లా ఫొటోగ్రాఫర్‌కు ప్రథమ స్థానం రావడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు మహ్మద్‌ హైదర్‌ అలీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కోస్గి నసీర్, జమీర్‌పాష, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మహ్మద్‌ వాజిద్, నేత శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు