రైలుకింద పడి వృద్ధుడి ఆత్మహత్య

9 Jan, 2017 22:48 IST|Sakshi

అనంతపురం న్యూసిటీ : గార్లదిన్నెకు చెందిన చిత్ర కాటమయ్య (71) సోమవారం లోలూరు రైల్వే క్రాస్‌ వద్ద రైలుకిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈయన తరచూ కడుపునొప్పితో బాధపడేవాడని కుటుంబ సభ్యులు తెలిపారు. అనంతపురం ఆస్పత్రిలో చికిత్స చేయించుకుని వస్తానని వెళ్లి ఇలా అఘాయిత్యానికి పాల్పడ్డాడని తెలిపారు. మృతుడికి భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. 

 

>
మరిన్ని వార్తలు