ఆకివీడు : నరసాపురం నుంచి విజయవాడ, నిడదవోలు నుంచి భీమవరం మీదుగా విజయవాడ వైపు వెళ్లే పలు రైళ్లను గురువారం రద్దు చేశారు. నరసాపూర్–హైదరాబాద్ రైలు రద్దు చేశారు. శుక్రవారం ఈ రైలు నడుస్తుంది. శుక్రవారం కూడా పూరి–తిరుపతి, నరసాపురం–గుంటూరు, మాచర్ల–భీమవరం, గుంటూరు–నరసాపురం, బిలాస్పూర్–తిరుపతి, కాకినాడ–సికింద్రాబాద్, బెంగుళూర్–కాకినాడ, కాకినాడ–బెంగుళూరు రైళ్లను రద్దు చేసినట్టు ఆకివీడు స్టేషన్ సూపరింటెండెంట్ నందన్ గురువారం చెప్పారు. కొన్ని రైళ్లను ఏలూరు–తాడేపల్లిగూడెం మీదుగా నడుపుతున్నారని చెప్పారు.