రాజధాని ప్రాంతంలో మరో పంటచేను ధ్వంసం

9 Dec, 2015 15:47 IST|Sakshi

రాజధాని ప్రాంతంలో మరో పంట చేను ధ్వంసమైంది. లింగాయపాలెం గ్రామంలోని సర్వే నెంబర్ 139ఏ, 139ఏ3, 140, 141లలోని గుండా రాజేశ్ అనే రైతుకు చెందిన 7.3 ఎకరాల అరటి తోటని రాత్రికి రాత్రే సీఆర్‌డీఏ అధికారులు ట్రాక్టర్‌లతో, జేసీబీలతో దున్ని చదును చేశారు. ల్యాండ్ పూలింగ్‌లో రాజేష్ తమన భూమిని ప్రభుత్వానికి ఇవ్వలేదు. తమ భూమిని ఇవ్వనందుకే కక్ష గట్టి రాత్రికి రాత్రే దున్నేశారని స్థానిక పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ఫిర్యాదు చేశారు. ఈ విషయం గురించి సీఆర్డీఏ అధికారులను అడుగగా పొరపాటున దున్నామని బదులిచ్చారు.


 

మరిన్ని వార్తలు