కులవివక్షకు వ్యతిరేకంగా పోరాడాలి

24 Jul, 2016 23:04 IST|Sakshi
కులవివక్షకు వ్యతిరేకంగా పోరాడాలి

కేవీపీఎస్‌ నేత నర్సింహ పిలుపు

యాచారం: కుల వివక్షపై పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కేవీపీఎస్‌ రాష్ట్ర నాయకుడు ఈ. నర్సింహ పిలుపునిచ్చారు. ఆదివారం మండల కేంద్రంలో ఆ సంఘం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నేటికీ కొన్ని గ్రామాల్లో అగ్రవర్ణాల చేతుల్లో  దళితులు అణుగుతునే ఉన్నారని అన్నారు. ఎక్కడో ఓ చోట దాడులకు గురివుతున్నారని పేర్కొన్నారు. ఎన్ని ప్రభుత్వాలు దళితుల కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న వారికి చేరకుండా పోతున్నాయని అన్నారు. బ్యాంకులు కూడ మోసం చేసే బడా వ్యాపారులనే నమ్ముతున్నాయని, అదే కాయకష్టం చేసుకునే వారిని మాత్రం పైస రుణాలు ఇవ్వకుండా కుట్రలు చేస్తున్నాయని అన్నారు. సమ న్యాయం వస్తే వివక్షత పోతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు బోడ క్రిష్ణ, నాగని బుగ్గరాములు, పి.అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు