లక్ష ఉద్యోగాలను భర్తీ చేయాలి

21 Aug, 2016 00:56 IST|Sakshi
జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌) : రాష్ట్రంలో కనీసం లక్ష ఉద్యోగాలను భర్తీ చేయాలని ఏఐవైఎఫ్‌ జాతీయ నాయకురాలు శ్యామల డిమాండ్‌ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని సంఘం కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు.  రాష్ట్రంలో రెండు లక్షలకుపైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఈ డిమాండ్ల సాధనకు ఈనెల 22న చలో సచివాలయం కార్యక్రమం నిర్వహించనున్నామన్నారు. దీనికి పెద్ద ఎత్తున నిరుద్యోగులు హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు. ఇందులో ఏఐవైఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి సురేష్, ఉపాధ్యక్షుడు సంతోష్, కార్యవర్గసభ్యుడు గోపాల్, నాయకులు మధుయాదవ్, నాగరాజు, సునిల్, సుమంత్, సుందర్‌రెడ్డి పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు