కిడ్నీ బాధితుడికి స్నేహితుల ఆర్థికసాయం

12 Sep, 2016 20:28 IST|Sakshi
కిడ్నీ బాధితుడికి స్నేహితుల ఆర్థికసాయం
మునుగోడు:
రెండు కిడ్నీలు చెడిపోయి మంచానికి పరిమితమైనా స్నేహితుడిని ఆదుకునేందుకు ముందుకు వచ్చారు.. వెల్మకన్నె గ్రామానికి చెందిన పలువురు యువకులు. 2000–2001లో వెల్మకన్నె పాఠశాలలో పదవత తరగతి చదివిన యువకుల్లో చండూరు మండలం కొండాపురం గ్రామానికి చెందిన కురిమిళ్లా భిక్షానికి ఇటీవల రెండు కిడ్నీలు చెడిపోయాయి. అయితే అతడిని ఆదుకునేందుకు అదే ఏడాది ఈతడితో పాటు విద్యను అభ్యసించిన 10 మంది యువకులు ఒక్కోకరు రూ వెయ్యి నుంచి రూ 2 వేల చొప్పున పొగుచేసిన రూ 22 వేలను అందించారు.  కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల నాయకుడు వనం రమేష్, దొంతరగొని గోపి, గంగనగొని శంకర్, మాలిగ నర్సింహ్మ, బద్దుల పరమేష్, ఏర్పుల అశోక్, దొటి శ్రీను, వరికుప్పల లింగయ్య, గణేష్‌ ఉన్నారు.
 
మరిన్ని వార్తలు