కాల్‌మనీ వేధింపులు... వ్యాపారి ఆత్మహత్య

12 Oct, 2016 22:05 IST|Sakshi
కాల్‌మనీ వేధింపులు... వ్యాపారి ఆత్మహత్య

విజయవాడ: బెజవాడలో వడ్డీ వ్యాపారుల ఆగడాలకు ఓ వ్యాపారి బలయ్యాడు. వారి వేధింపులు తాళలేక ప్రసాదంపాడుకు చెందిన ఫైనాన్స్ వ్యాపారి పొట్లూరి శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్నాడు.

మూడు నెలల క్రితం ఇతను రూ.7 కోట్లకు ఐపీ పెట్టాడు. అయినా సరే వ్యాపారుల నుంచి ఒత్తిడి ఎక్కువ కావడంతో శ్రీనివాస్ గుడివాడలోని తన వెంచర్‌లో పురుగుల మందు తాగాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఆయన మృతిచెందాడు. ఆత్మహత్యకు గల కారణాలను శ్రీనివాస్ సూసైడ్‌లో పేర్కొన్నాడు. వ్యాపారుల వేధింపుల కారణంగానే తన భర్త మృతిచెందాడని దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా సరిగా స్పందించలేదని శ్రీనివాస్ భార్య చెప్పారు. దీని వెనుక రాజకీయ నేతల ఒత్తిళ్లున్నాయని ఆమె ఆరోపించారు. తమకు వ్యాపారుల నుంచి రక్షణ కల్పించాలని కోరుతున్నారు.

 

మరిన్ని వార్తలు