గుర్తు తెలియని మృతదేహం లభ్యం

19 Aug, 2016 23:08 IST|Sakshi

సూరపురాజుపల్లె(రైల్వేకోడూరు రూరల్‌):  సూరపురాజుపల్లె సమీపంలోని ఏటి పక్కనున్న ఓ మామిడి తోటలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు శుక్రవారం గుర్తించారు. స్థానికులు అందించిన సమాచారం మేరకు ఎస్సై రమేష్‌బాబు సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వయసు 40 ఏళ్లు ఉండవచ్చు. మృతదేహం పూర్తిగా కుళ్లి పోయి గుర్తు పట్టడానికి వీలు లేకుండా ఉంది. ఒంటిపై ఆకుపచ్చ టీ షర్టు ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే రైల్వేకోడూరులో ఇటీవల ఎవరూ అదృశ్యం కాలేదు. అన్ని రకాల కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు