చెరువులో చేపపిల్లల మృతి

1 Oct, 2016 22:44 IST|Sakshi
చెరువులో చేపపిల్లల మృతి
పలివెల(మునుగోడు)
 మండలంలోని పలివెల గ్రామంలో ఇటీవల రైతులు వేసుకున్న చేప పిల్లలు శుక్రవారం రాత్రి మృతిచెందాయి. ఆ గ్రామంలోని గవాసీ కుంటలో 10 రోజుల క్రితం 30 మంది రైతులు రూ. 80 వేలు ఖర్చుచేసి 10 వేల చేప పిల్లను వేసుకున్నారు. అయితే ఆ చేప పిల్లలకు ఏమైందో తెలియదు గానీ శనివారం తెల్లవారే సరికి మృతి చెంది కన్పించాయి. ఎవ్వరైనా గుర్తుతెలియని దుండగులు కావాలనే చెరువులో విషం కలపి చంపి ఉంటారని రైతులు ఆరోపిస్తున్నారు. వారం రోజుల్లోనే తీవ్రంగా నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని చేపలు వేసిన పంతంగి రామలింగం, శంకర్, సురేష్, రామచంద్రం, లచ్చయ్య, గిరి కోరారు.
 
 
 
మరిన్ని వార్తలు