పేకాట శిబిరంపై దాడులు.. ఐదుగురు అరెస్ట్

30 Mar, 2016 08:07 IST|Sakshi

రాజేంద్రనగర్: రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఐదుగురు పేకాట రాయుళ్లను పోలీసులు బుధవారం తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. బుద్వేల్ రైల్వే స్టేషన్ సమీపంలోని లారీ పార్కింగ్ పక్కన కట్టెల గోదాములో పేకాట శిబిరం నడుస్తుందన్న సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. ఐదుగుర్ని అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.69,600 నగదు స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని వార్తలు