మహబూబ్నగర్ క్రీడలు : స్కూల్ స్పోర్ట్స్ ప్రమోషన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ జింఖానా మైదానంలో జరిగిన అండర్–16 రాష్ట్రస్థాయి ఫుట్బాల్ టోర్నీలో జిల్లా బాలుర జట్టు రన్నరప్గా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో హైదరాబాద్ జట్టు 3–2 గోల్స్ తేడాతో జిల్లా జట్టుపై విజయం సాధించింది. జిల్లా జట్టు రెండో స్థానంలో నిలవడంపై సీనియర్ క్రీడాకారులు ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.