సీసీ కెమెరాల కోసం 50 వేలు విరాళం

21 Jul, 2016 18:36 IST|Sakshi
సీసీ కెమెరాల కోసం 50 వేలు విరాళం

కోదాడ: పట్టణంలో రక్షణ ఏర్పాట్లను మరింత పటిష్టం చేసే కార్యక్రమంలో బాగంగా మరిన్ని సీసీ కెమెరాలను ఏర్పాటు చెయడానికి పట్టణ పోలీసులు ముందుకు వచ్చారు. తమ ఒక్క రోజు వేతనం రూ. 50 వేలను పట్టణ రక్షణ కమిటీకి గురువారం అందజేశారు. ఈ సందర్భంగా పట్టణ సీఐ రజితారెడ్డి మాట్లాడుతూ కోదాడ పట్టణాన్ని మొత్తం నిఘా నీడలో తీసుకొచ్చి ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా చూస్తామని తెలిపారు. దీనికి చేయూతనిచ్చిన పోలీసు సిబ్బందిని ఆమె ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిల్‌ సభ్యులు ముడియాల భరత్‌రెడ్డి, శ్రీపతిరెడ్డి, మేళ్లచెరువు కోటేశ్వరరావు, కొమరగిరి రంగారావు తదితరులు పాల్గొన్నారు.


 

మరిన్ని వార్తలు