నాగోలు: ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన వ్యక్తిపై అత్యాచారం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, చీటింగ్ కేసులు నమోదైన సంఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. మహబూబ్నగర్ జిల్లా అచ్చంపేట మండలం ఉప్పునుంతల గ్రామానికి చెందిన ఓ యువతి (33)కి నల్లగొండ జిల్లా నుతనకల్ సిల్పకుంటలకు చెందిన బి.సతీష్కుమార్తో ఫోన్లో పరిచయం ఏర్పడింది.
సతీష్కుమార్ ఎల్బీనగర్ గుంటిజంగయ్యనగర్లో నివాసముంటూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించిన సతీష్ ఆమెతో నాలుగేళ్లు కలిసున్నాడు. తీరా వివాహం చేసుకోవాలని ఆమె కోరగా సతీష్ తప్పించుకొని తిరుగుతున్నాడు. అంతేకాకుండా తక్కువ కులమంటూ దూషిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నాడని బాధితురాలు సోమవారం రాత్రి ఎల్బీనగర్ పీఎస్లో ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తులో ఉంది.