బెలుం గుహల్లో విదేశీయుల బృందం

17 Sep, 2016 21:37 IST|Sakshi
బెలుం గుహల్లో విదేశీయుల బృందం
కొలిమిగుండ్ల: ప్రఖ్యాత బెలుం గుహలను శనివారం విదేశీయులు తిలకించారు. నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ కార్యక్రమాల అమలు  తీరును అధ్యయనం చేసేందుకు అల్జీరియా, సూడాన్, ఇథోఫియా, ఘనా, మారిషస్, నేపాల్, లిబియా, సిరియా,టాంజానియా తదితర.. 14 దేశాల నుంచి 28 మంది వచ్చారు. బెలుం గుహలో పలు ప్రదేశాలను తిలకించారు. వారి వెంట ఎన్‌ఐఆర్డీ అధికారి నరసింహులు, ఆర్‌డబ్లూఎస్‌ ఈఈ వెంకట రమణ, ఎస్‌ఈ వీరభద్రరావు, డీఈ ఉమామహేశ్వరరావు ఉన్నారు.
 
మరిన్ని వార్తలు