ఏరువాకా సాగారో..

10 May, 2016 02:09 IST|Sakshi
ఏరువాకా సాగారో..

గ్రామాల్లో సోమవారం ఏరువాక జోరుగా సాగింది. అక్షయ తృతీయను పురస్కరించుకుని రైతులు తమ కాడెద్దులు, ఎడ్లబండ్లను అలంకరించారు. బోనాలు, ఎడ్లబండ్లతో పొలాలకు వెళ్లి భూమిపూజ చేశారు. ఈ ఏడాది పంటలు బాగా పండాలని భగవంతుడిని ప్రార్థించారు. అరకలు కట్టి దుక్కులు దున్నారు. అక్షయ తృతీయనుపురస్కరించుకుని సోమవారం గ్రామాల్లో ఏరువాక సాగించారు. రైతులు తమ కాడెద్దులు, ఎడ్లబండ్లను అందంగా అలంకరించారు. బోనాలు, ఎడ్లబండ్లతో వ్యవసాయ పొలాల్లోకి వెళ్లి భూమిపూజ నిర్వహించారు. ఈ సంవత్సరం  పంటలు బాగా పండి సుఖసంతోషాలతో ఉండేలా చూడాలని భగవంతుడిని ప్రార్థించారు. అరకలు కట్టి దుక్కులు దున్నడం ప్రారంభించారు.

మరిన్ని వార్తలు