ఆలయ నిర్మాణానికి భూమి పూజ

28 Aug, 2016 20:29 IST|Sakshi
ఆలయ నిర్మాణానికి భూమి పూజ
చౌటుప్పల్‌: ప్రతిఒక్కరూ ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకోవాలని ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. మండలంలోని ధర్మోజిగూడెంలో సీతారామచంద్ర స్వామి దేవాలయ నిర్మాణానికి ఆదివారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దైవచింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ కొంతం రాంరెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు కాసర్ల శ్రీనివాస్‌రెడ్డి, ఉపసర్పంచ్‌ బత్తుల శ్రీహరి, కొంతం కృష్ణారెడ్డి, బుచ్చిరెడ్డి, సుశీల, పద్మ, పగిళ్ల నర్సిరెడ్డి, భూపాల్‌రెడ్డి, సామిడి అంజిరెడ్డి, రాంచంద్రారెడ్డి, కొంతం దామోదర్‌రెడ్డి, లింగారెడ్డి, రాఘవరెడ్డి, సింహాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు