చౌటుప్పల్: ప్రతిఒక్కరూ ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకోవాలని ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. మండలంలోని ధర్మోజిగూడెంలో సీతారామచంద్ర స్వామి దేవాలయ నిర్మాణానికి ఆదివారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దైవచింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొంతం రాంరెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు కాసర్ల శ్రీనివాస్రెడ్డి, ఉపసర్పంచ్ బత్తుల శ్రీహరి, కొంతం కృష్ణారెడ్డి, బుచ్చిరెడ్డి, సుశీల, పద్మ, పగిళ్ల నర్సిరెడ్డి, భూపాల్రెడ్డి, సామిడి అంజిరెడ్డి, రాంచంద్రారెడ్డి, కొంతం దామోదర్రెడ్డి, లింగారెడ్డి, రాఘవరెడ్డి, సింహాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.