డిసెంబర్ 5న దుర్గగుడి ఫ్లైఓవర్ శంకుస్థాపన

28 Nov, 2015 11:45 IST|Sakshi

విజయవాడ : విజయవాడ నగరంలో దుర్గగుడి ఫ్లైఓవర్కు శంకుస్థాపనకు ముహుర్తం ఖరారైంది. డిసెంబర్ 5వ తేదీన ఈ ఫ్లైఓవర్కు శంకుస్థాపన చేయనున్నారు.  ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రులు నితీన్ గడ్కరీ, వెంకయ్యనాయుడిలతోపాటు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరుకానున్నారు. ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 464 కోట్లను మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్మాణాన్ని కృష్ణా పురష్కరాల నాటికి పూర్తి చేసే విధంగా చర్యలు తీసునేందుకు ఇప్పటికే అధికారులు చర్యలు చేపట్టారు.

మరిన్ని వార్తలు