టీడీపీ నేత కిడ్నాప్.. నలుగురు కిడ్నాపర్ల అరెస్ట్

6 Jan, 2016 19:06 IST|Sakshi

చిత్తూరు: చిత్తూరు జిల్లాలో బుధవారం నలుగురు కిడ్నాపర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. కిడ్నాపర్లు యాదమర్రిలో టీడీపీ నేత భజలింగంను కిడ్నాప్ చేశారు. ఆయన నుంచి 50 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. దాంతో భజలింగం కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అయితే కిడ్నాపర్లకు 50 లక్షల రూపాయలు ఇచ్చేందుకు భజలింగం కొడుకులు వెళ్లగా.. కిడ్నాపర్లను రెడ్ హ్యాండెడ్గా బంగారుపాళ్యెం పోలీసులు పట్టుకున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

>
మరిన్ని వార్తలు