లోయలో పడ్డ కారు: నలుగురి పరిస్థితి విషమం

16 Aug, 2016 06:48 IST|Sakshi

విశాఖ: విశాఖ జిల్లాలోని అనంతగిరి సమీపంలో మంగళవారం తెల్లవారుజామున ఓ కారు లోయలో పడింది. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. అతివేగంగా వస్తున్న కారు ఒక్కసారిగా అదుపు తప్పి లోయలో పడటంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలిసింది. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు