వ్యభిచారం కేసులో నలుగురి అరెస్ట్‌

3 Oct, 2016 23:07 IST|Sakshi

కడప అర్బన్‌ : కడపలోని మృత్యుంజయకుంటలో సోమవారం మధ్యాహ్నం ఓ ఇంటిలో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరు మహిళలు, ఇద్దరు విటులను అరెస్టు చేసినట్లు చిన్నచౌకు ఎస్‌ఐ ధనుంజయుడు తెలిపారు. అరెస్టు అయిన వారిలో నిర్వాహకురాలు పద్మ అలియాస్‌ పార్వతి, మరో మహిళ ధనలక్ష్మి, విటులలో వల్లూరు మండలం గోటూరుకు చెందిన మోహన్‌రెడ్డి, ఒంటిమిట్ట మండలం మాధవరంలోని పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్న గంగాధర్‌ ఉన్నారు. వీరిని కోర్టులో హాజరు పరచనున్నామని ఎస్‌ఐ తెలిపారు.


 

మరిన్ని వార్తలు