కూకట్‌పల్లిలో బోర్డు తిప్పేసిన కన్సల్టెన్సీ

1 Aug, 2016 20:12 IST|Sakshi

కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ కన్సల్టెన్సీ నిరుద్యోగులకు కుచ్చుటోపీ పెట్టింది. ఒక్కో నిరుద్యోగి నుంచి రూ.లక్ష నుంచి రూ.లక్షా యాభై వేల వరకు వసూలు చేసింది. సుమారు 70 మంది వద్ద వసూలు చేసిన కన్సల్టన్సీ నిర్వాహకులు మొదటి రెండు నెలలు జీతాలు ఇచ్చి ఆ తర్వాత చేతులు దులుపుకున్నారు. దీంతో బాధితులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఈ విషయం గురించి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

మరిన్ని వార్తలు