కర్నూలు(ఆర్యూ) : సాయి అక్షర ఎడ్యుకేషనల్ రూరల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఎంసెట్కు ఉచితంగా కోచింగ్ ఇస్తున్నట్లు సొసైటీ కార్యదర్శి ఎం.వెంకటేశ్వర్లు మంగళవారం తెలిపారు. కొత్తబస్టాండ్ దగ్గరున్న శ్రీనివాస టాకీస్ బి.వి.రిజెంట్ ప్లాజాలో ఈనెల 24వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయన్నారు. ఇతర వివరాలకు ఫోన్(97039 96418, 89850 33927)లో సంప్రదించాలన్నారు.