గ్రూప్‌ -2 అభ్యర్థులకు ఉచిత శిక్షణ

20 Dec, 2016 00:07 IST|Sakshi
కర్నూలు(హాస్పిటల్‌): జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు గ్రూప్‌–2లో ప్రత్యక్ష ప్రసార మాధ్యం ద్వారా ఉచిత శిక్షణ అందించనున్నట్లు డీఆర్‌డీఏ పీడీ రామకృష్ణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ–డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ నుంచి ప్రముఖ అధ్యాపకులచే ప్రత్యక్ష ప్రసార మాధ్యం ద్వారా ఈ శిక్షణ కార్యక్రమం చేపడుతున్నామన్నారు. ఆసక్తి, అర్హత గల ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగ యువతీయువకులు 21, 22వ తేదీల్లో ఉదయం 10 గంటలకు నంద్యాలలోని రామకృష్ణ డిగ్రీ కళాశాలలో తమ ఒరిజినల్‌ సర్టిఫికెట్లు, ఆధార్‌కార్డులతో ఎంపిక ప్రక్రియకు హాజరుకావాలన్నారు. వివరాలకు కలెక్టరేట్‌లోని డీఆర్‌డీఏ కార్యాలయం,  08518–277499, 8522083879, 8341581022, 91770016174ను సంప్రదించాలన్నారు. 
మరిన్ని వార్తలు