ఉచిత హెపటైటిస్‌ శిబిరం

29 Jul, 2016 00:02 IST|Sakshi
శిబిరాన్ని పరిశీలిస్తున్న మేయర్‌ పాపాలాల్‌

ఖమ్మంవైద్య విభాగం : సాయిరాం గ్యాస్ట్రో లివర్‌ ఆస్పత్రి, రోటరీ క్లబ్‌ ఆఫ్‌ స్తంభాద్రి ఆధ్వర్యంలో గురువారం స్థానిక సర్దార్‌ పటేల్‌ స్టేడియంలో ఉచిత హెపటైటిస్‌ శిబిరాన్ని నగర మేయర్‌ పాపాలాల్‌ ప్రారంభించారు. హెపటైటిస్‌ బీ,సీ పరీక్షలు నిర్వహించి, హెపటైటిస్‌ బీ వ్యాక్సినేషన్‌ చేపట్టారు. శిబిరంలో 521 మంది హాజరయ్యారు. కార్యక్రమంలో కార్పొరేషన్‌ కమిషనర్‌ శ్రీనివాస్, ఐఎంఏ కార్యదర్శి బొల్లికొండ శ్రీనివాసరావు, రోటరీక్లబ్‌ ఆఫ్‌ స్తంబాద్రి ప్రెసిడెంట్‌ వందనపు శ్రీనివాస్, జంగాల సునీల్‌ కుమార్‌  పాల్గొన్నారు.

 

మరిన్ని వార్తలు