మరియాపురంలో ఉచిత వైద్య శిబిరం

13 Dec, 2016 21:19 IST|Sakshi

కడప ఎడ్యుకేషన్‌: కడప నగరం మరియాపురంలోని సెయింట్‌ జోసెఫ్‌ జూనియర్‌ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్‌ ఆధ్వర్యంలో గోసుల కృష్ణారెడ్డి ఫౌండేషన్‌ సహకారంతో ఉచిత మెడికల్‌ క్యాంపు నిర్వహించారు. సంబంధిత క్యాంపును మరియాపురం ఎంపీపీఎస్‌ స్కూల్లో ఏర్పాటు చేశారు. ఈ క్యాంపులో డాక్టర్లు గోసుల శివభారత్‌రెడ్డి, డాక్టర్‌ సతీష్‌రెడ్డితోపాటు బీఎంఓ టెక్నీషియన్‌ షరీఫ్‌లు వైద్యసేవలందించారు. సంబంధిత క్యాంపును కళాశాల కరస్పాండెంట్‌ బాలస్వామిరెడ్డి, ప్రిన్సిపాల్‌ రజనీకాంత్‌రెడ్డి ప్రారంభించారు. ఈ శిబిరంలో చాలా మంది పాల్గొని తమ మోకాళ్ల నొప్పులకు, ఎముకల సాంధ్రతను పరీక్షించుకున్నారు.  వైవీయూ ఎన్‌ఎస్‌ఎస్‌ కోర్డినేటర్‌ రాంప్రసాద్‌రెడ్డి, ఎన్‌ఎస్‌ఎస్‌ పీవో బాబులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు