జావా , డాట్‌నెట్‌ కోర్సులకు ఉచిత శిక్షణ

24 Jul, 2017 22:35 IST|Sakshi

ఎస్కేయూ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఎస్కేయూలో మూడు నెలల పాటు ఉచిత శిక్షణా కోర్సులు నిర్వహిస్తున్నట్లు ప్రాజెక్ట్‌ మేనేజర్‌ టీ.హెచ్‌. విన్సెంట్‌ తెలిపారు. ఈ తరగతులకు హాజరైన అభ్యర్థులకు సర్టిఫికెట్‌తో పాటు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. ప్రతి రోజూ నాలుగు గంటలు శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు  www.joskills.appssdc.inవెబ్‌సైట్‌నందు తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలు కోసం 9490978868, 7801031771 నెంబర్లు ద్వారా సమాచారం తెలుసుకోవచ్చు.

మరిన్ని వార్తలు