మార్టేరులో రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్‌ పోటీలు

26 Aug, 2016 18:51 IST|Sakshi
మార్టేరు(పెనుమంట్ర) : గ్రామంలో శనివారం నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రస్థాయి ఇన్విటేషన్‌ బాస్కెట్‌ బాల్‌ పోటీలు జరగనున్నాయి. గ్రామానికి చెందిన దివంగత ఫిజికల్‌ డైరెక్టర్‌ పడాల ప్రహ్లాదరెడ్డి మెమోరియల్‌ పేరిట ఈ పోటీలు నిర్వహించనున్నారు. స్థానిక వేణుగోపాలస్వామి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఆవరణలో బాస్కెట్‌ బాల్‌ కోర్టు సిద్ధం చేశారు. శనివారం సాయంత్రం 4 గంటలకు పోటీలను పారిశ్రామిక వేత్త గొలుగూరి శ్రీరామారెడ్డి ప్రారంభిస్తారని, విశిష్ట అతి«థిగా వైఎస్సార్‌ సీపీ ఆచంట నియోజకవర్గ సమన్వయ కర్త కవురు శ్రీనివాసు హాజరవుతారని చెప్పారు. 
 
 
మరిన్ని వార్తలు