మసీదుల అభివృద్ధికి నిధులు మంజూరు

12 Dec, 2016 15:20 IST|Sakshi
మసీదుల అభివృద్ధికి నిధులు మంజూరు
–జిల్లా మైనార్టీ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ మస్తాన్‌వలీ
 
గూడూరు: మసీదుల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తున్నట్లు జిల్లా మైనార్టీ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ మస్తాన్‌వలీ తెలిపారు. మంగళవారం ఆయన గూడూరులో మసీదులను పరిశీలించారు. గూడూరులో 6, చనుగొండ్లలో 2, పెంచికలపాడు, బూడిదపాడులలో 1 చొప్పున మసీదుల మరమ్మతులకు నిధులు అవసరమని గుర్తించామని చెప్పారు. ఆయన వెంట స్థానిక మున్సిపల్‌ కౌన్సిలర్‌ పీఎన్‌ అస్లామ్, మైనార్టీ సంఘం నేతలు ఉన్నారు.
 
మరిన్ని వార్తలు