విజయవాడ : కృష్ణాజిల్లా జి.కొండూరు పోలీస్ స్టేషన్ వద్ద కాల్పుల ఘటనలో గాయపడిన కృష్ణారావు అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. బుల్లెట్ గాయం కారణంగా అతనికి వైద్యులు ఆపరేషన్ చేశారు. కృష్ణారావు ఇంకా వెంటిలేటర్పైనే ఉన్నాడు. కాగా ఓ యువకుడి అనుమానస్పద మృతితో కోడూరు గ్రామస్థులు ఎస్ఐ, సిఐ, కానిస్టేబుళ్లపై కర్రలు, రాళ్లతో దాడిచేశారు.
సిఐ ఆత్మరక్షణ కోసం జరిపిన కాల్పుల్లో నలుగురు గాయపడ్డారు. కాగా పోలీస్స్టేషన్పై దాడి, పోలీసు కాల్పుల ఘటనపై జిల్లా కలెక్టర్ మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు. ఘటనపై స్పందించిన కలెక్టర్ బుద్ధప్రకాశ్ మైలవరం సీఐ బంగార్రాజుతో సహా ఎస్సై అబ్దుల్ హక్ను విధుల నుంచి తొలగించిన విషయం తెలిసిందే.