కోరుట్ల : పట్టణంలోని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం గణతంత్య్ర దినోత్సవం కోసం న్యాయవాదులకు ఇండోర్ గేమ్స్ పోటీలు నిర్వహించారు. న్యాయవాదులు క్యారం బోర్డు పోటీల్లో పాల్గొన్నారు. న్యాయవాదులు బోయిని సత్యనారాయణ, బైరి విజయ్, కట్కం రాజేశ్, బద్ది నర్సయ్య, చెన్న విశ్వనాథం, బీమనాతి రఘు తదితరులు పాల్గొన్నారు.