మిడుతూరు : చౌట్కూరులో వినాయక నిమజ్జనం సందర్భంగా గురువారం నిర్వహించిన వేలంలో గ్రామానికి చెందిన శ్వేత బోర్వెల్స్ అధినేత మధుసూదన్రెడ్డి స్వామి వారి లడ్డూను రూ.1.2 లక్షలకు దక్కించుకున్నారు. ఎస్ఐ చంద్రశేఖర్రెడ్డి లడ్డూను మధుసూదన్రెడ్డికి అందజేశారు. అంతకముందు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.