గంజాయి స్మగ్లింగ్.. పోలీసుల హస్తం!

20 Nov, 2016 12:14 IST|Sakshi

చింతూరు: ఒడిశా నుంచి తెలంగాణకు లారీలో తరలిస్తున్న గంజాయి లోడును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలంలోని రత్నాపురం గ్రామంలో ఆదివారం రోజు తనిఖీలు చేసిన పోలీసులు ఆరుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 2,125 కిలోల గంజాయితో పాటు లారీని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విలువ రూ. 63.70 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.

గంజాయి అక్రమ రవాణకు సహకరిస్తున్న ఓ సీఐ, కానిస్టేబుల్ పై పోలీసు ఉన్నతాధికారులు కేసు నమోదు చేశారు. ఒడిశా నుంచి తెలంగాణకు భారీగా గంజాయి తరలించడానికి సహకరించిన మారేడుమిల్లి సీఐ అంకబాబుతో పాటు కానిస్టేబుల్ సత్యనారాయణపై కేసు నమోదు చేసినట్లు చింతూరు ఓఎస్‌డీ డాక్టర్ కే. ఫకీరప్ప విలేకరులకు తెలిపారు.

మరిన్ని వార్తలు