600 కేజీల గంజాయి స్వాధీనం

27 Jul, 2016 14:12 IST|Sakshi

విజయనగరం : కోరాపుట్ నుంచి భువనేశ్వర్కు అక్రమంగా తరలిస్తున్న 600 కేజీల గంజాయిని విజయనగరం జిల్లాలోని సాలూరులో పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు