ఇద్దరు గంజాయి స్మగ్లర్లు అరెస్ట్

18 Jul, 2016 11:25 IST|Sakshi
హైదరాబాద్: కీసరకు చెందిన ఇద్దరు బడా స్మగ్లర్లను పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. శ్రీనివాస్‌రెడ్డి, శివ అనే ఇద్దరు గంజాయి స్మగ్లర్లను మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో హయత్‌నగర్ పోలీసులు ఈ రోజు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఓ ఫార్చునర్ కారును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను హయత్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
 
మరిన్ని వార్తలు