‘చెత్త’బండి.. నెట్టాలండి..

24 Aug, 2016 17:39 IST|Sakshi
విద్యానగర్‌కాలనీ ట్రాక్టర్‌ను తోస్తున్న మహిళ పారిశుద్ధ్య కార్మికులు

సంగారెడ్డి పట్టణంలో నిత్యం చెత్తసేకరించే ట్రాక్టర్‌ తరచూ మోరాయిస్తోంది. దీన్ని నెట్టలేక పారిశుద్ధ్య కార్మికులు నానా అవస్థలు పడుతున్నారు. రోజుకు ఐదారుసార్లు మొరాయిస్తోండడంతో మహిళా కార్మికులు సైతం నరకం చూస్తున్నారు. మున్సిపల్‌ అధికారులు స్పందించి ట్రాక్టర్‌కు మరమ్మతులు చేయించాలని కోరుతున్నారు. - సాక్షి ఫొటోగ్రాఫర్‌, సంగారెడ్డి

మరిన్ని వార్తలు