గోమాత మాల దీక్ష స్వీకరణ

12 Nov, 2016 00:09 IST|Sakshi
గోమాత మాల దీక్ష స్వీకరణ
కర్నూలు (న్యూసిటీ): జిల్లా గోరక్షణ మహాసంఘం (గోరక్షణ శాల)లో శుక్రవారం తొలిసారిగా 30 మంది గోమాత మాల దీక్షలు స్వీకరించారు. శ్రీకృష్ణ భగవానునికి, గోమాతలకు పూజలు చేసి, గోవుకు పచ్చిగడ్డితో తులాభారం నిర్వహించి దీక్ష చేపట్టారు.  ఈ సందర్భంగా దేవాదాయ ధర్మదాయ శాఖ కార్యనిర్వణాధికారి కె.కమలాకర్‌ మాట్లాడుతూ.. గోమాత మాల దీక్షలు స్వీకరిస్తే శ్రీకృష్ణుని అనుగ్రహం లభిస్తుందన్నారు. మిడ్తూరు గ్రూపు దేవాలయాల కార్య నిర్వహణాధికారి టి.హనుమంతరావు, మాజీ పాలక మండలి సభ్యులు శ్రీకాంత్‌ నాయుడు, ఎస్‌.సదానందం పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు