లక్ష్యంతో చదివితేనే విజయం

23 Jul, 2016 19:56 IST|Sakshi
స్విట్స్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో విద్యార్థులకు సూచనలిస్తున్న అమెజాన్‌ ఇండియా కంపెనీ హెచ్‌ఆర్‌ ముజితబా అహ్మద్‌
–అమెజాన్‌ కంపెనీ ఇండియా లిమిటెడ్‌ హెచ్‌ఆర్‌ మేనేజర్‌ ముజితబా అహ్మద్‌
దేవరకద్ర రూరల్‌:  విద్యార్థులు లక్ష్యం నిర్దేశించుకుని చదవితే విజయం మీ సొంతమవుతుందని  అమెజాన్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ హెచ్‌ ఆర్‌ మేనేజర్‌ ముజితబా అహ్మద్‌ అన్నారు. శనివారం మండలంలోని స్విట్స్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో ‘ఉద్యోగమెలా సాధించాలి’ అనే అంశంపై చివరిసంవత్సరం విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. అమెజాన్‌ కంపెనీ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సుకు ఆ కంపెనీ హెచ్‌ఆర్‌ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదవాలని సూచించారు.  ఉద్యోగ అవకాశాలు పొందాలంటే నైపుణ్యాలు సమకూర్చుకోవాలని ఆయన వివరించారు. సదస్సులో కళాశాల డీన్‌ కె.సుధాకర్, ప్రిన్సిపాల్‌ తిరుపతిరెడ్డి, హెచ్‌ఓడీ సంతోష్, మీడియా అధికారి కె.సుధాకర్‌ తదితరులు ఉన్నారు.
 
 
మరిన్ని వార్తలు