రికార్డుకెక్కిన గిరిబాబు తండ్రి

10 Sep, 2016 23:12 IST|Sakshi
హైరేంజ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డును అందజేస్తున్న పల్లె సుమన్, దైవజ్ఞశర్మ

నాంపల్లిః సినీ నటులు గిరిబాబు తండ్రి నాగయ్యకు హైరేంజ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డు లభించింది. 105 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు ఈ రికార్డును అందజేశారు. శనివారం గిరిబాబు ఇంటికి వెళ్లిన హైరేంజ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌ సీఈఓ పల్లె సుమన్, దైవజ్ఞ శర్మ అధ్యక్షతన సర్టిఫికెట్‌ను అందజేశారు. ప్రకాశం జిల్లాలో 1910లో జన్మించిన నాగయ్య 106 ఏళ్ల వయసులోనూ తన పనులను తాను చేసుకుంటారన్నారు. కార్యక్రమంలో గిరిబాబు తనయుడు రఘుబాబు తదితరులు పాల్గొన్నారు.





 

మరిన్ని వార్తలు