తంబోలా ఆడొద్దన్నందుకు కిరోసిన్ పోసుకొని..

21 May, 2016 10:11 IST|Sakshi

పార్వతీపురం(విజయనగరం): తంబోలా ఆడొద్దని తండ్రి మందలించడంతో బాలిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన సీతానగరంలో శుక్రవారం చోటుచేసుకుంది. దీనికి సంబంధించి స్థానిక ఏరియా ఆస్పత్రి ఔట్‌పోస్టు పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన యామలి ఈశ్వరరావు తన కుటుంబంతో పాటు ఐదేళ్ల కిందట ఉపాధి కోసం తిరుపతికి వలస వెళ్లాడు. గొల్లపల్లి గ్రామదేవత పండగ సందర్భంగా రెండు రోజుల కిందట సీతానగరం వచ్చాడు.

పండుగ ముగియడంతో తిరిగి తిరుపతి వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. ఈ క్రమంలో ఈశ్వరరావు కుమార్తె ఉమ శుక్రవారం ఉదయం ఎదురింట్లో జల్దీఫైవ్ ఆడుతుండగా గమనించిన తండ్రి ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో మనస్థాపానికి గురైన ఉమ ఇంటిలోకి వెళ్లి కిరోసిన్ పోసుకుని నిప్పటించుకుంది. వెంటనే కుటుంబ సభ్యులు, స్థానికులు మంటలార్పి ఆమెను స్థానిక ఏరియూ ఆస్పత్రికి తరలించారు. ఎస్సై బి. లక్ష్మణరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు