కడుపునొప్పి తాళలేక బాలిక ఆత్మహత్య

14 Feb, 2017 01:30 IST|Sakshi
అనంతపురం సెంట్రల్‌: కడుపునొప్పి తాళలేక ఓ బాలిక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు...నగరంలో ప్రియాంకనగర్‌లో నివాసముంటున్న నాగప్ప కుమార్తె అనిత (15) పదోతరగతి వరకు చదివింది. ఈమె కొన్ని నెలలుగా కడుపునొప్పితో బాధపడుతోంది. సోమవారం కడుపునొప్పి అధికమై ఇంట్లో  ఎవరూలేని సమయంలో ఉరేసుకుంది. కుటుంబ సభ్యులు గమనించి ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చే సమయానికి బాలిక మృతి చెందింది.  త్రీటౌ¯ŒS సీఐ వెంకటేసులు, ఎస్‌ఐ కరుణాకర్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 
మరిన్ని వార్తలు