ధ్యాన్‌చంద్‌కు భారతరత్న ఇవ్వాలి

29 Aug, 2016 23:17 IST|Sakshi
కరీంనగర్‌ స్పోర్ట్స్‌ : ఒలంపిక్స్‌లో దేశ ఖ్యాతిని ఇనుమడింపజేసిన హాకి లెజెండ్‌ ధ్యాన్‌చంద్‌కు భారతరత్న ఇవ్వాలని ప్రజాప్రయోజనాల పరిరక్షణ సమితి నాయకులు కోరారు. తెలంగాణచౌక్‌లో సోమవారం ఈమేరకు ప్రదర్శన నిర్వహించారు. క్రీడాకారుడిగా మూడు, కోచ్‌గా మూడు బంగారు పతకాలు సాధించిన ఘనత ధ్యాన్‌చంద్‌కు మాత్రమే దక్కిందన్నారు. జిల్లా కేంద్రంలో ధ్యాన్‌చంద్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్న హామీని మేయర్‌ నిలబెట్టుకోవాలని కోరారు. జిల్లా అధ్యక్షుడు మహ్మద్‌ అమర్, రాజేశ్, ఆనంద్, నాగరాజు, అరుణ్, కిరణ్‌కుమార్, మహేశ్, అరవింద్‌ తదితరులు పాల్గొన్నారు. 
మరిన్ని వార్తలు