భూమి ఇవ్వండి

14 Sep, 2015 11:51 IST|Sakshi

ప్రభుత్వం దళితులకు కేటాయించిన భూములను రీసర్వే చేసి అర్హులకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ.. దళిత మహిళలు ఆందోళనకు దిగారు. వైఎస్సార్ జిల్లా రాజంపేట మండలం ఆరికపాడుకు చెందిన దళిత మహిళలు ఈ రోజు స్థానిక తహసిల్దార్ కార్యలయం ఎదుట ధర్నానిర్వహించారు. ప్రభుత్వం కేటాయించిన భూములను దళితులకు పంచాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం తహసిల్దార్‌కు వినతిపత్రం అందించారు.
 

మరిన్ని వార్తలు