నకిరేకల్ః
హైదరాబాద్లోని శ్రీ చైతన్య కళాశాలలో అధిక ఫీజులు నియంత్రించాలని కోరుతూ కళాశాల ముందు నిరసన తెలుపుతున్న పీడీఎస్యూ విద్యార్థి నాయకులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని పీడీఎస్యూ డివిజన్ కార్యదర్శి జీడి ప్రవీణ్ డిమాండ్ చేశారు. అక్రమ అరెస్టులను నిరసిస్తూ నకిరేకల్లో పీడీఎస్యూ ఆధ్వర్యంలో శ్రీ చైతన్య, నారాయణ కళాశాలల దిష్టిబొమ్మ దహనం చేశారు. కార్యక్రమంలో నాయకులు నోముల సతీష్, శ్రవణ్, నాగరాజు, ఉపేందర్, వెంకటేష్, హిమబిందు, మౌనిక, సమత, సౌజన్య, సైదులు, అనీల్ ఉన్నారు.