వైభవంగా సువ్రతీంద్రుల ఆరాధన

8 May, 2017 00:02 IST|Sakshi
వైభవంగా సువ్రతీంద్రుల ఆరాధన
మంత్రాలయం : శ్రీరాఘవేంద్రస్వామి మఠం పూర్వ పీఠాధిపతి సువ్రతీంద్రుల ఆరాధనోత్సవాన్ని ఆదివారం వైభవంగా నిర్వహించారు. పీఠాధిపతి సుబుదేంద్రతీర్థులు నేతృత్వంలో ముందుగా రాఘవేంద్రుల మూల బృందావనానికి విశిష్ట పూజలు చేశారు. అనంతరం సువ్రతీంద్రుల మూలబృందావనానికి నిర్మల్య విసర్జన, జల, పంచామృతాభిషేకాలు గావించి విశేషంగా అలంకరించారు. శాస్త్రోక్త పూజలనంతరం మంగళహారతులు పట్టారు. వేడుకల్లో మేనేజర్‌ శ్రీనివాసరావు, అసిస్టెంట్‌ మేనేజర్‌ ఐపీ నరసింహమూర్తి, ధార్మిక సహాయక అధికారి వ్యాసరాజాచార్‌ పాల్గొన్నారు.  
 
మరిన్ని వార్తలు