రాజమండ్రి: ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి వరద తగ్గుముఖం పట్టింది. శుక్రవారం ఉదయానికి బ్యారేజీ వద్ద నీటిమట్టం 10.8 అడుగులకు చేరింది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చిరికను ఉపసంహరించారు. 8.77 లక్షల క్యూసెక్కుల నీటిని అధికారులు సముద్రంలోకి విడుదల చేశారు.